ఎయిర్ పోర్టులో నాగ్-నయన లవ్స్టోరీ!
అక్కినేని నాగార్జున, నయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి సంబంధించినషూటింగ్ బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లతో పాటు కె.విశ్వనాథ్ లపై సన్నివేశాలనుఇక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో నాగార్జున ఓఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు.

No comments:
Post a Comment