'జులాయి' ఆ సినిమా కాపీ అంటూ రూమర్?
అల్లుఅర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించినచిత్రం 'జులాయి'. ఈ నెల 9న విడుదల అవుతున్న ఈ చిత్రం హిందీ చిత్రం జన్నత్ కు కాపీ అంటూ ప్రచారం జరుగుతోంది.ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో మహేష్ భట్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అందులోంచేహీరో క్యారెక్టరైజేషన్ తీసుకున్నారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్ స్పెడ్ అవుతోంది. గతంలో కూడా త్రివిక్రమ్ కొన్ని ఆంగ్లచిత్రాల స్పూర్తితో చిత్రాలు చేయటంతో ఈ సినిమా కూడా అదే బాపతు అని ఫిక్స్ అవుతున్నారు. అయితే నిజా నిజాలుతెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

No comments:
Post a Comment